Reading Time: 1 minute

నేటి కాలంలో కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం అందరికి అలవాటు గా మారింది. దీని వల్ల అసిడిటీ సర్వసాధారణమైపోయింది. గుండెలో మంటగా అనిపించగానే చాలామంది డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాపుకు వెళ్లి యాంటాసిడ్ మాత్రలు లేదా సిరప్‌లు వాడుతుంటారు. అవి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి కాబట్టి వాటికి అలవాటు పడిపోతుంటారు. అయితే ఈ మందులను దీర్ఘకాలం పాటు వాడటం వల్ల మన శరీరానికి ఎంతటి హాని జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాత్రల వెనుక ఉన్న చేదు నిజాలను వివరంగా తెలుసుకుందాం.

అసిడిటీని తగ్గించడానికి మనం వాడే పి.పి.ఐ (PPI) వంటి మందులు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని నిలిపివేస్తాయి. జీర్ణక్రియకు యాసిడ్ చాలా అవసరం కానీ అది పూర్తిగా తగ్గిపోతే మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి అందవు. ముఖ్యంగా విటమిన్ బి12, కాల్షియం మెగ్నీషియం శోషణ తగ్గిపోతుంది.

దీనివల్ల కాలక్రమేణా ఎముకలు బలహీనపడి విరగడం, విపరీతమైన నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే కడుపులో యాసిడ్ లేకపోవడం వల్ల ఆహారం ద్వారా వచ్చే హానికరమైన బ్యాక్టీరియా చనిపోకుండా నేరుగా పేగుల్లోకి వెళ్తుంది, దీనివల్ల తరచుగా ఇన్ఫెక్షన్లు మరియు జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

Acidity Relief Pills: Short-Term Comfort, Long-Term Health Risks?
Acidity Relief Pills: Short-Term Comfort, Long-Term Health Risks?

మందులపై ఆధారపడటం వల్ల మూత్రపిండాల పై కూడా తీవ్రమైన ఒత్తిడి పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటాసిడ్లను నిరంతరం వాడటం వల్ల కిడ్నీ పనితీరు నెమ్మదించడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందుకే అసిడిటీకి మందులు వాడటం కంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఉత్తమ మార్గం.

సరైన సమయానికి భోజనం చేయడం రాత్రి నిద్రకు రెండు గంటల ముందే ఆహారం తీసుకోవడం, అధికంగా నీరు తాగడం వంటి అలవాట్లు అసిడిటీని సహజంగా తగ్గిస్తాయి. మందులు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే ఇస్తాయని, మూల కారణాన్ని సరిదిద్దుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గుర్తుంచుకోవాలి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ మీకు అసిడిటీ సమస్య తీవ్రంగా ఉంటే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

The post అసిడిటీ తగ్గాలనే ఉద్దేశంతో మందులు… శరీరంపై దుష్ప్రభావాలు ఇవే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.