Reading Time: < 1 minute
Vizag Horror Navy Employee Kills Girlfriend Chops Body And Stores In Fridge

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఒక యువతిని హత్య చేసిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాజువాక 70వ వార్డు పరిధిలోని ఎల్‌బీ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ హత్యతో గాజువాక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. నేవీ ఉద్యోగి అయిన ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం… శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన నేవీ ఉద్యోగి రవీందర్ తన ప్రియురాలిని ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. కొంత భాగాన్ని ఫ్రిజ్‌లో, మరో భాగాన్ని గోనె సంచిలో దాచాడు. ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన అనంతరం నిందితుడు స్వయంగా గాజువాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రవీందర్ ఇంటికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు.

Also Read: CM Chandrababu: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. పుదూరులో టిడ్కో గృహాల ప్రారంభం!

ఈ దారుణానికి కారణంగా కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత వివాదాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రవీందర్ భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలిని ఇంటికి పిలిపించుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలి వివరాలు, హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.