Reading Time: < 1 minute
Ap Ias Officer Transfers 2026 New Collectors Appointed In Guntur Visakhapatnam And Kakinada

AP IAS Officer Transfers 2026: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు కేటాయించింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బదిలీల్లో భాగంగా ఎస్. షాన్‌ మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించారు. దినేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల అభివృద్ధికి ఈ నియామకం కీలకంగా మారనుంది.

Also Read: AP Tiger News: పెద్దపులి కథ సుఖాంతం.. ఏజెన్సీ ఇక ఊపిరి పీల్చుకో!

ఇక జిల్లాల పరిపాలనలో కూడా మార్పులు చేశారు. సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించగా.. ఎం. అభిషిక్త్ కిశోర్‌ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్‌ను కాకినాడ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విద్యా రంగంలోనూ కీలక నియామకం జరిగింది. తమిమిన్ అన్సారీయాను పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నియమించారు. మరోవైపు టి. నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో రాష్ట్ర పరిపాలన మరింత వేగవంతం అవుతుందని, కొత్త బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ తమ విభాగాల్లో అభివృద్ధికి కృషి చేస్తారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.