
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా రాజీనామా చేశారు. ఇటీవలే ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇరువురు పదవులకు రాజీనామా చేశారు. నితిన్ నవీన్ రాజీనామాను బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ ఆమోదించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: యుద్ధం వేళ మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు
స్పీకర్కు నితీష్ కుమార్ తన రాజీనామాను సమర్పించారని జేడీయూ సీనియర్ నాయకుడు, మంత్రి విజయ్ చౌదరి ధృవీకరించారు. ఇక స్పీకర్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మార్చి 16 నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి 14 రోజుల గడువు ఉండడంతో ఈరోజు రాజీనామా చేశారు. ఇక రాజ్యసభలో ఏప్రిల్ 10న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ రాజకీయాలు మరింత అస్థిరంగా మారాయి. ఇప్పుడు రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. అధికార కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చలు ప్రారంభం కాగా.. రాజకీయ వర్గాల్లో పలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి జేడీయూ స్థానంలో బీజేపీ రాబోతోంది. బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది ఎవరన్నది సస్పెన్ష్గా ఉంది.