కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , ఒక కప్పు పచ్చిశనగపప్పు అవి కూడా నానబెట్టినవి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, నాలుగు కరివేపాకులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర కిలో నూనెను తీసుకోవాలి.
ముందుగా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి: ఒక పెద్ద గిన్నె తీసుకుని బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ నువ్వులు, నానబెట్టిన ఒక కప్పు పచ్చిశనగపప్పు అలాగే, కరివేపాకు ఆకులు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.
ఇక ఆ తర్వాత దీనిలో కొద్దిగా నూనెను వేసి పిండిలో బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా దీనిని కలుపుకోవాలి. ఆ తర్వాత వాటికీ కొద్దిగా నూనెను రాసుకుని, ఉండలుగా చేసుకోవాలి
కవర్ లేదా ఏదొక ఆకుపై ఆయిల్ రాసి, ఉండలను అప్పాలుగా చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక అప్పాలను నూనెలో వేసి, సన్నని మంటపై కాల్చి బంగారు కలర్లోకి మారే వరకు బాగా వేయించాలి.
అంతే వేడి వేడి అప్పాలు రెడీ. ఇవి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ కానీ గిన్నెలో కానీ వీటిని తీసుకోవాలి. ఇంకా వీటిని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎన్నో రోజులు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగా తింటారు.




