
అమరావతి రాజధాని స్థితిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక ఎవరూ ఇంచు కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, “మూడు ముక్కలాట లేదు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని – అదే అమరావతి” అని పునరుద్ఘాటించారు. శాసనసభలో తీర్మానం చేసినట్లు పేర్కొంటూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, సత్తాను చూపిస్తామని తెలిపారు. త్వరలోనే కేంద్రం కూడా దీనిపై చట్టం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు