Reading Time: < 1 minute
Stock Market Crash Sensex Nifty In Heavy Losses Amidst Ongoing War Tensions

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం యుద్ధం తీవ్రత మరింత ముదిరింది. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు భూతల దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా, ఆసియా మార్కెట్లు ఘోరంగా కుప్పకూలిపోయాయి. అదే ప్రభావం మన మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ఇది కూడా చదవండి: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయి 72, 582 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 22, 530 దగ్గర కొనసాగుతోంది. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.93.59 దగ్గర కొనసాగుతోంది.

నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టీఎంపీవీ ప్రధానంగా నష్టపోగా.. హిండాల్కో, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ రంగాలు మినహాయించి.. మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత