Reading Time: < 1 minute
Telangana Assembly: బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు.. లైవ్ వీడియో

తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు ఊహించని టర్న్ తీసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య సాగిన మాటల యుద్ధం విచారణకు ఆదేశించే వరకు వెళ్లడంతో.. ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. ఆదివారం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. గందరగోళం నెలకొంది. సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీవేయాలని.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలంటూ నినాదాలు చేశారు. అయితే.. బీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే మైనింగ్‌ అంశంపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. CID విచారణకు ఆదేశించిన తర్వాత హౌస్‌ కమిటీ ఎందుకు..? బీఆర్ఎస్‌ దగ్గర ఆధారాలు ఉంటే సీఐడీకి ఇవ్వొచ్చన్నారు. నిరసనలతో సభను అడ్డుకోవవడం తగదని.. హౌస్‌ కమిటీ వేయాలని నిరసన కొనసాగిస్తున్న BRS ఎమ్మెల్యేలకు సూచించారు.

కాగా.. అక్రమ మైనింగ్‌ అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది.. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది.