
Daniel Vettori: ఐపీఎల్ తొలి పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పరాజయం పాలైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 202 పరుగులు లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ అంశంపై తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి నిర్మొహమాటంగా స్పందించారు. బౌలింగ్లో క్రమశిక్షణ లేదని.. లెంగ్త్ అసలే లేదన్నారు. “ఈ మ్యాచ్లో మా జట్టు బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. బౌలింగ్లో క్రమశిక్షణ లేదు. అందుకే ఓటమి పాలయ్యాం. ఫిలిప్ సాల్ట్ వికెట్ను త్వరగానే పడగొట్టగలిగాం. కానీ.. విరాట్, పడిక్కల్లు ఈజీగా రన్స్ చేసేలా అవకాశం ఇచ్చాం. ఆర్సీబీ జట్టు బాగా ఆడింది. కానీ.. మా జట్టు బౌలర్లు సరైన లెంగ్త్లో బాల్స్ వేయలేకపోవడంతోనే రన్స్ వచ్చాయి.” అని వివరించారు.
READ MORE: Raghavendra Rao: శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు సెన్సేషనల్ కామెంట్స్!
చిన్నస్వామి స్టేడియం లాంటి ఫ్లాట్ పిచ్పై తాము చేసిన 201 పరుగులు ఏమాత్రం సరిపోవని కోచ్ వెట్టోరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు 200 మార్క్ దాటితే సురక్షితంగా భావించే వాళ్లాం. ఇంత స్కోర్ చేస్తే మ్యాచ్ గెలుస్తామని ధీమాగా ఉండే వాళ్లం. కానీ ప్రస్తుతం ఐపీఎల్లో పరిస్థితులు మారిపోయాయన్నారు. “ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అలాంటి టీమ్ ముందు ఈ స్కోరును ఛేజ్ చేయకుండా నిలువరించడం చాలా కష్టం. ఈ విషయాన్ని నేను ముందే ఊహించాను. ఇక మా టీమ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి ఓపెనర్లు త్వరగా అవుట్ కావడం టీమ్పై ఒత్తిడి పెరిగింది. అయితే ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ చివర్లో అనికేత్ వర్మ అద్భుతంగా ఆడారు. వీళ్ల వల్లే కనీసం ఈ స్కోర్ చేయగలిగాం. ప్రతి మ్యాచ్లోనూ ఓపెనర్లే ఆడాలని అనుకోలేం. మా బ్యాటింగ్ లైనప్పై నాకు పూర్తి నమ్మకం ఉంది.” అని తెలిపారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి తీవ్రంగా విమర్శించారు. ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫ్ఫీ ఏ లెంగ్త్లో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడో చూసి కూడా తమ బౌలర్లు నేర్చుకోవాలన్నారు. మ్యాచ్ చివర్లో మళ్ళీ గాడిలో పడి వికెట్లు తీసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. అయితే యువ బౌలర్లు డేవిడ్ పేన్, హర్ష్ దూబే రాబోయే మ్యాచ్ల్లో పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.