Reading Time: 2 minutes
Parenting Tips To Reduce Mobile Addiction In Children

Health Tips: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరి చేతుల్లో ఫోన్ అనేది ఉండాల్సిందే. చిన్నపిల్లలు అతిగా ఫోన్ వాడటం కారణంగా వారిలో అశాంతి, చిరాకు, ఒత్తిడి వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించవచ్చు. నిజానికి మీ పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి ఈ టిప్స్ పాటించి దూరం చేయవచ్చు. ఈ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Digvijaya Singh: బీజేపీ-ఆర్ఎస్ఎస్‌పై డిగ్గీరాజా ప్రశంసలు.. కాంగ్రెస్ పరేషాన్..

పిల్లలు పాఠశాల, ఇల్లు మరియు ఆటల మధ్య దీన్ని సులభంగా ఉపయోగిస్తారు. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు గంటల తరబడి మొబైల్ ఫోన్‌లతో గడుపుతున్నారని మరియు వారి నుండి దూరంగా ఉన్నప్పుడు అశాంతి, చిరాకు లేదా ఒత్తిడిని ప్రదర్శిస్తున్నారని గమనించవచ్చు. ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా అభివృద్ధి చెందుతుంది మరియు పిల్లల దినచర్య, చదువు, క్రీడలు మరియు సామాజిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో ఏకాగ్రత, నిద్ర, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ వ్యసనాన్ని అధిగమించడానికి, తల్లిదండ్రులు మొదట పిల్లలతో స్పష్టంగా మాట్లాడాలని పలువురు వైద్యులు చెబుతున్నారు. మితిమిరిన మొబైల్ వినియోగం వారి ఆరోగ్యం, చదువులు, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పిల్లలకు వివరించడం ముఖ్యం అని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగించడానికి సమయ పరిమితులను నిర్ణయించడం, అలాగే పిల్లలను ఇతర వినోద కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం ఈ వ్యసనం నుంచి వారిని బయటపడేటానికి సహాయకరంగా ఉంటుందని వివరించారు.

పిల్లల్లో ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు వారితో ఫ్యామిలీ గేమ్స్, ఔట్ డోర్ గేమ్స్, చదువులు, ఇతర అభిరుచుల వైపు చిన్నారులను ప్రోత్సహిస్తే, వారు మొబైల్ ఫోన్‌ల నుంచి దృష్టి మరల్చడానికి విశేషంగా హెల్ప్ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలతో సమానంగా తల్లిదండ్రులు కూడా తమ సొంత మొబైల్ వాడకాన్ని పరిమితం చేసుకోవాలని, దీంతో పిల్లలకు తల్లిదండ్రులు మంచి ఉదాహరణగా నిలుస్తారని చెప్పారు. పిల్లలు నిబంధనలు పాటిస్తూ తక్కువ సమయం పాటు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించినప్పుడు వారిని ప్రోత్సహించాలని చెప్పారు.

ఎక్కువగా మొబైల్ చూస్తే ఈ సమస్యలు వస్తాయి..
మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా వాడటం వల్ల పిల్లల్లో అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ చూస్తే కంటి అలసట, చికాకు, దృష్టి మసకబారడం, తలనొప్పి రావడం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. అలాగే పిల్లల్లో నిద్రలేమి, చిరాకు, దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం తగ్గవచ్చని చెప్పారు. ఇంకా పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతారని, చిరాకు పడతారని, మనుషులతో కలవడానికి, తోటి వారితో కలిసి ఆడుకోడానికి ఇష్టపడరని వెల్లడించారు. ఇది వారి చదువులు, క్రీడలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.

వీటిని ట్రై చేయండి..

రోజులో పరిమిత సమయం మాత్రమే మొబైల్ వాడండి.

పిల్లలు ఆరు బయట ఆడుకోవడానికి, ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.

రాత్రి పడుకునే ముందు పిల్లలకు మొబైల్ ఇవ్వకూడదు.

మీ పిల్లలతో తగినంత సమయం గడపండి, అలాగే వారితో మనసు విప్పి మాట్లాడి అతిగా ఫోన్ వాడితే కలిగే అనర్థాల గురించి వివరించండి.

READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్ సింగర్ కచేరీపై మతోన్మాద గుంపు దాడి..