Reading Time: < 1 minute
Suvendu Adhikari Touches Yogi Adityanath Feet Bengal Election Campaign Viral Video

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బెంగాల్‌లో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా బెంగాల్‌లోని కాంతిలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై యోగి కాళ్లకు సువేందు అధికారి నమస్కరించారు. యోగి మెడలో కండువా కప్పి వెంటనే కాళ్ల మీద పడ్డారు. యోగి వారిస్తున్నా కూడా నేల వరకు వంగి నమస్కరించారు. వేదికపై ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి.. యోధురాలిగా పోరాడతానన్న మమత

పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఏప్రిల్ 23న జరుగుతుండగా.. రెండో విడత ఏప్రిల్ 29న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తోందని ఆరోపించారు.