
Wife Kills Husband: ఇటీవల కాలంలో భర్తలను చంపే భార్యలు ఎక్కువ అవుతున్నారు. ఇతరులతో సంబంధాలు పెట్టుకుని భర్తల్ని హతమారుస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం పచ్చటి కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో కూడా ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. 23 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి కుట్ర పన్ని, భర్తను హతమార్చింది. ఈ నేరాన్ని దోపిడీగా చిత్రీకరించాలని ప్రయత్నించింది. చివరకు పోలీసుల విచారణలో పట్టుబడింది. ఈ సంఘటన అటెర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కేసులో కీలక నిందితురాలు రూబీని, ఆమె ప్రియుడు విశాల్ విమల్(21)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 8న నిలేష్ జాతవ్(27) అనే వ్యక్తి మోటార్ సైకిల్పై వెళ్తుండగా గుర్తుతెలియని దొంగలు అతడి భార్య రూబీ, వారి చిన్నారి కళ్ల ముందే కాల్చి చంపినట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాము జమ్నా గ్రామం నుంచి ఖారికాకు తిరిగి వస్తుండగా బ్యాగ్ రోడ్డుపై పడిపోయిందని రూబీ పోలీసులకు చెప్పింది. తన భర్త బైక్ ఆపి, తాను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తపై కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే నిజాలు తెలిశాయి.
రూబీ చెబుతున్న విషయాలకు పొంతన లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రూబీ తన సమీప బంధువైన విమల్తో ఏడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇరువుతు తరుచుగా వాట్సాప్ కాల్స్, చాట్స్ ద్వారా మాట్లాడుకునే వారు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రూబీ, భర్తను ఎలాగైన అడ్డుతప్పించుకోవాలని హత్యకు ప్లాన్ చేసింది. ప్రణాళిక ప్రకారం, ముందుగా నిర్ణయించుకున్న ప్రాంతంలో బ్యాగ్ పడిపోయేలా చేసింది, దీని కోసమే ఎదురుచూస్తున్న విమల్, జాతవ్ను కాల్చి చంపాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.