
కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని తెలంగాణ జిల్లాల్లో వేసవి ప్రారంభంలోనే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గిపోతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు కాగా, 170 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో 131 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. వేసవి అవసరాలకు 55 టీఎంసీలు అవసరం కాగా, ప్రస్తుతం డెడ్ స్టోరేజీ పోగా కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే వేసవి అవసరాలకు 15 టీఎంసీల నీటి కొరత ఉంది. ఈ పరిస్థితి తాగునీటి కష్టాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా బెదిరింపులు ఇరాన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపవు
Warangal: నిప్పుల కుంపటిలా మారిన వరంగల్
Medicos Reels: వైద్యానికి రీల్స్ వైరస్ పట్టిందా..?
Iran vs USA Conflict: యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ చమురు అవసరాల పై భారం
Thalapathy Vijay: తమిళనాడులో ఆకట్టుకుంటున్న విజయ్ ఎన్నికల ప్రచారం