
గ్యాస్ కొరత వేళ షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ‘జగ్ విక్రమ్’ ఎల్పీజీ నౌకకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఇది ఏప్రిల్ 14, మంగళవారం నాడు గుజరాత్లోని కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక ఏప్రిల్ 11న జలసంధిని దాటింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఉపశమనం.
Also Read:Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ సోమవారం వివరాలు అందించారు. భారత జెండా కలిగిన ‘జగ్ విక్రమ్’ అనే ఎల్పిజి నౌక ఏప్రిల్ 11న హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిందని ఆయన తెలిపారు. ఈ నౌక సుమారు 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఇది ఏప్రిల్ 14న కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
Also Read:CM Chandrababu: పరిశ్రమల పర్మిషన్లలో సరళీకరణ.. ఆన్లైన్ విధానంపై సీఎం గ్రీన్ సిగ్నల్..!
మార్చి నెల ఆరంభం నుంచి పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరిన తొమ్మిదవ భారతీయ నౌక జగ్ విక్రమ్. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో పదిహేను భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. భారతదేశానికి సరుకులను తీసుకువస్తున్న అనేక విదేశీ జెండాలు గల నౌకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, అమెరికా హార్ముజ్లో దిగ్బంధనాన్ని ప్రకటించింది. హార్ముజ్లో అమెరికా జోక్యం వల్ల నౌకా రవాణా నిలిచిపోతుందా లేక సురక్షిత రాకపోకలు కొనసాగుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.