Reading Time: < 1 minute
Hyderabad Set Target Of 217 Runs For Rajasthan

ఐపీఎల్ 2026 లో 21వ మ్యాచ్ ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ 91 పరుగుల సహాయంతో, హైదరాబాద్ రాజస్థాన్‌కు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (91; 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (40; 26 బంతుల్లో) రాణించాడు. నితీశ్‌ రెడ్డి (28), ట్రావిస్ హెడ్ (18), సలీల్ అరోరా (24*) పరుగులు చేశారు. అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్‌ రెండు వికెట్లు, సందీప్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, తుషార్‌ దేశ్‌పాండే చెరో వికెట్‌ తీశారు.