
వరంగల్లో గంజాయి మత్తుకు బానిసలైన పోకిరీలు ఉన్మాదులుగా మారి అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్స్ కావాలనే ఆలోచనతో ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. ఈ దాడులను వీడియోలు తీసి అప్లోడ్ చేయడంతో వరంగల్లో తీవ్ర కలకలం రేగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఐదు ఘటనలు జరిగాయి. ఇటీవల వరంగల్లోని ఎల్బీ నగర్లో జరిగిన ఘటనలో గాంధీనగర్కు వెళ్లిన సురేష్ను గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అడ్డగించారు. బండరాయితో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము