
హైదరాబాద్ ఐటీ హబ్లో గంజాయి కలకలం. గచ్చిబౌలి పరిధిలోని నానక్రామ్గూడలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగమే ముసుగుగా.. క్యాబ్ డ్రైవర్తో కలిసి సాగిస్తున్న ఈ దందాను శేరిలింగంపల్లి ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు.
ఈ కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమానంద్ మల్లిక్తో పాటు క్యాబ్ డ్రైవర్ విశాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు ప్యాకెట్లలో నింపిన సుమారు 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి నుంచి ఈ గంజాయిని సేకరించి.. నగరంలోని యువతకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన రాఘవేంద్ర , ఆకాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.