
దర్శకుడు అభిలాష్ రెడ్డి ‘బైకర్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ గా బైకర్ సక్సెస్ కాకున్నా అభిలాష్ టేకింగ్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసిన విధానం మెచ్చుకుని తీరాలి. బైకర్ సినిమా అభిలాష్ కు బోగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. తన తదుపరి సినిమా కోసం ఆయన ఒక భారీ స్థాయి స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు స్టేట్స్ రైట్స్ మైత్రి మూవీస్ & పీపుల్ మీడియా చేతికి
టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి చెప్పిన కథ వినగానే దిల్ రాజు వెంటనే ఇంప్రెస్ అయ్యారని మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ ఈ చిత్రంలో నటించబోయే హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. కథా బలం ఎక్కువగా ఉన్నందున, ఒక క్రేజీ స్టార్ హీరోని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.