
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలంలోని నలంద జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధించారని కాలేజీ చైర్మన్ ఎం.వెంకట చౌదరి, సీఈవో చైతన్య కృష్ణ, ప్రిన్సిపల్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. జూనియర్ఎంపీసీలో పి.చరణ్ 469, ఉజ్వల్ అభినవ్ సాయి 468, హారిక, భరణి, పి.హర్షిని, జస్వంత్ రోజ్ 467 మార్కులతో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారన్నారు.
30 మంది స్టూడెంట్స్ 460కిపైగా మార్కులు సాధించారన్నారు. జూనియర్ బీపీసీలో లక్ష్మీ మౌనిక 436, కె.రేఖశ్రీ 435 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో 493 మార్కులు ఊర్మిళ సాధించిందన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో డి.వినీలా 990, బీపీసీలో మైత్రి 986 మార్కులు సాధించినట్టు తెలిపారు.