Reading Time: < 1 minute
Padmam Silver Jewellery Showroom Launch Anakapalle Offers

Padmam Silver Jewellery: ప్రముఖ సిల్వర్ జువెలరీ సంస్థ పద్మం సిల్వర్ జువెలరీ మరొక శాఖను అనకాపల్లి లో ఈరోజు ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర రావు గారు, ఏపీ యుఎఫ్ఐ డిసి చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మళ్ల సురేంద్ర గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధ నాగ జగదీష్ గారు, పట్టణ టిడిపి నాయకులు శ్రీ దాడి రత్నాకర్ గారు, అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రామకృష్ణ గారు, శ్రీ ఉప్పల అన్నాజీ గారు వంటి పలు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ దాడి వీరభద్ర రావు గారు మాట్లాడుతూ ప్రముఖ పద్మం సిల్వర్ జువెలరీ వారు తమ మరో శాఖను అనకాపల్లిలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రారంభోత్సవ సందర్భంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడం ఎంతో హర్షణీయమని అన్నారు.

READ ALSO: NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!

ఈ సందర్భంగా సీఎంఆర్ గ్రూపు చైర్మన్ శ్రీ మావూరి వెంకటరమణ గారు మాట్లాడుతూ పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభోత్సవ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలు పై 50వేల రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా, 50 వేల రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై 25 వేల రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగాను, 25వేల రూపాయల సిల్వర్ జువెలరీ కొనుగోలుపై 12,500 విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని అనకాపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

READ ALSO: IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!