Reading Time: < 1 minute
Venkatesh Remuneration Doubles Sankranthiki Vasthunnam Success Boosts His Market To Rs 20 Cr

టాలీవుడ్‌లో ‘విక్టరీ’ వెంకటేష్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వరుస విజయాలు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న భారీ మార్కెట్ కారణంగా వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వెంకీ.. ఇప్పుడు రూ.20 కోట్లు తీసుకుంటున్నారని టాక్. రెమ్యూనరేషన్ హైక్ కావడానికి కారణం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్ సహా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో చేసిన గెస్ట్ అప్పియరెన్స్‌కు వచ్చిన స్పందనే అని సమాచారం.

2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వెంకటేష్ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బలంగా ఆకట్టుకుంది. ఈ సక్సెస్ తర్వాత వెంకీ మామ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ కోసం రూ.20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతోనే రెమ్యూనరేషన్‌ 100 శాతం జంప్ అయింది. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ అయింది. అనిల్ రావిపూడితో వెంకీ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా ఇంతే ఛార్జ్ చేయనున్నారు.

Also Read: Pooja Hegde Stylish Look: స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో పూజా హెగ్డే.. మతి పోగొడుతున్న బుట్టబొమ్మ!

విక్టరీ వెంకటేష్ కెరీర్‌ను గమనిస్తే.. మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను నిలబెట్టుకున్న హీరోగా గుర్తింపు ఉంది. స్టార్‌డమ్ కంటే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా వెంకీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా.. కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తారు. కెరీర్‌ ఎక్కువగా విజయాలు అందుకున్న వెంకీ.. రెమ్యూనరేషన్ పరంగానూ టాప్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. మొత్తానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌తో వెంకటేష్‌కు డబుల్ లాభం వచ్చినట్టే. ప్రస్తుతం వెంకీ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.