Reading Time: < 1 minute
Telangana: తెలంగాణలో కొత్త పథకం.. నేరుగా అకౌంట్లోకి రూ.10 లక్షలు.. వీరందరికీ ఛాన్స్

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్రమాద బీమా, బోనస్ లాంటి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరో నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులు సహజ మరణం పొందితే కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చేసింది. ప్రతీ కార్మికుడికి ఇవి వర్తించనుందని సింగరేణి వర్గాలు స్పష్టం చేశాయి.

రూ.కోటి ప్రమాద బీమా

ఇక సింగరేణి కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తూ చనిపోతే కుటుంబానికి రూ. కోటి ప్రమాద బీమా స్కీమ్‌ను ఇప్పటికే అందిస్తోంది. అయితే వీధుల్లో ఉన్నప్పుడు మరణిస్తేనే ఇది వరిస్తుంది. సహజ మరణం పొందినవారికి ఎలాంటి బీమా లేదు. అయితే ఇప్పుడు సహజ మరణం పొందినా.. కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తారు. ఈ బీమా పథకాన్ని అమలు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో మరణించినా లేదా ఇతర కారణాలతో మరణించినా బీమా సొమ్ము అందుతుంది. యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతారు. యూనియన్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉండాలని తెలిపింది. త్వరలో అన్ని బ్యాంకులు కూడా కార్మికులకు ఈ సౌకర్యం కల్పించనున్నాయి.

ప్రీమియం లేకుండానే..

మాములుగా జీవిత బీమా తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని బ్యాంక్ భరించనుంది. ప్రస్తుతం కార్మికులకు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యూనియన్ బ్యాంక్ రూ.కోటి ప్రమాద బీమాను అమలు చేస్తున్నాయి. ఇందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రూ.10 లక్షల బీమా ప్రకటించగా.. మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో నడించేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో త్వరలో సిగరేణి కార్మికులందరికీ ప్రయోజనం దక్కనుంది. కాగా సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో హెల్త్ ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా సింగరేణి సంస్థ కల్పిస్తోంది.