వేసవిలో ఎంత హైడ్రేటెడ్ గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. ఇక వాటిలో రాగి పాలు బెస్ట్. ఇలా చేసి తాగితే చేస్తే రుచి అదుర్స్. . దీనికి కావలసిన పదార్థాలు, ఇంకా ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగి గింజలు, ఒక కప్పు బాదం, తురిమిన కొబ్బరి పొడి , ఒక టేబుల్ స్పూన్ నూనె , ఒక టేబుల్ స్పూన్స్ బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మూడు టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు, తగినంత నీరు తీసుకోవాలి
రాగి పాలను ఎలా తయారు చేసుకోవాలంటే?
ముందుగా ఒక కప్పు రాగి గింజలను తీసుకుని వాటిని నీటితో రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా తొలగించి, గింజలను ఒక పలుచటి క్లాత్ పై బాగా ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిపోయిన తర్వాత మీడియం మంటపై వేయించుకోవాలి.
రాగి గింజలు బాగా వేయించి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీని తీసుకుని రాగి గింజలు, బాదం , కొబ్బరి తురుము , బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి, నీరు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.
టీ గరిటెతో కానీ, ఒక పలుచటి క్లాత్ తీసుకుని దీనిని వడకట్టాలి. ఇంకా దీనిలో నీరు కూడా పోసి మళ్లీ గ్రైండ్ చేసి పాలు లాగా దీనిని వేరుచేయవచ్చు. చివర్లో సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్ కూడా వేసి తాగితే సూపర్ ఉంటుంది.




