
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. శంషాబాద్లోని హోటల్ నోవాటెల్లో శనివారం(ఏప్రిల్ 4) రాత్రి ప్రభుత్వం తరపున అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, జస్టిస్ సూర్యకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తగిన గౌరవ మర్యాదలను కల్పించడంలో సీఎం స్వయంగా పర్యవేక్షించారు.
ఈ విందు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ,ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ ,కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య పరస్పర గౌరవాన్ని చాటిచెప్పేలా ఈ భేటీ సాగింది.
►ALSO READ | ఆలయాల పరిసరాల్లో నో పాలిటిక్స్.. తిరుమల తరహాలో రూల్స్: సీఎం రేవంత్