Reading Time: < 1 minute
Kaushik Reddy Assembly Naxalite Comments

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తూ, అవసరమైతే తాను ‘అసెంబ్లీ నక్సలైట్‌’గా మారుతానని, అందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హుజూరాబాద్ ప్రజలు ఏం పాపం చేశారని అక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నారని ప్రశ్నించిన ఆయన, ఇది కరోనా కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఉన్న వ్యక్తిగత కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, కావాలంటే తనను మెట్రో పిల్లర్‌కు ఉరి వేయాలని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!

ప్రభుత్వం తనపై పెడుతున్న కేసులు , విచారణల పేరుతో కాలయాపన చేస్తోందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. వచ్చే రెండేళ్ల పాటు తనను కేసులతో ఇబ్బంది పెట్టవచ్చని, కానీ రెండేళ్ల తర్వాత కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు ఇప్పుడు తనను వేధిస్తున్న కేసులే పోలీసుల మెడకు చుట్టుకుంటాయని హెచ్చరించారు. తన సొంత ఊరిలో దేవుడికి మొక్కుకోవడానికి వెళ్తున్న తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాను ఏదైనా తప్పు చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజా పోరాటంలో భాగంగా అసెంబ్లీ వేదికగా గొంతు వినిపిస్తానని, అందుకు ‘అసెంబ్లీ నక్సలైట్’గా మారడానికైనా సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.

CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!