Reading Time: 2 minutes
You Crazy Bastards Trump Threatens Massive Strikes On Iranian Power Plants Bridges Over Hormuz

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన పోస్ట్‌లో, హార్మూజ్ జలసంధిని తెరవాలని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు. అలా చేయని పక్షంలో భారీ దాడిలు చేస్తామని బెదిరించారు. ఏప్రిల్ 6 గడువుకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచారు. మంగళవారం ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు.

Also Read:SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

“మంగళవారం ఇరాన్‌లో ‘పవర్ ప్లాంట్ డే’, ‘బ్రిడ్జ్ డే’ ఒకేసారి జరుగుతుంది. ఇలాంటిది ఎక్కడా చూడలేరు!!! హార్ముజ్ జలసంధి తెరవండి, మీ పిచ్చి బాస్టర్డ్స్… లేదంటే మీరు నరకంలో జీవించాల్సి వస్తుంది.. చూడండి!” (అసభ్య భాషలో)అంటూ ఇరాన్ పై విరుచుకుపడ్డాడు. అమెరికా-ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపుగా మూసివేసింది. ప్రపంచంలోని సుమారు 20% ఆయిల్ రవాణా ఈ జలసంధి గుండా జరుగుతుంది. దీని వల్ల ప్రపంచ ఆయిల్ ధరలు పెరిగాయి.

ఇంతకు ముందు ట్రంప్ ఇరాన్‌కు 48 గంటలు గడువు ఇచ్చి, జలసంధి తెరవకపోతే పవర్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని బెదిరించారు. తర్వాత బ్రిడ్జెస్ (వంతెనలు) తర్వాత ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లు లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు మంగళవారం నుంచి ఈ దాడులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ ఈ హెచ్చరికలకు తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామని, గల్ఫ్ దేశాల ఎనర్జీ సైట్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. కొన్ని గల్ఫ్ రిఫైనరీలపై ఇరాన్ దాడులు జరిగాయని నివేదికలు వచ్చాయి. ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు గత నెల రోజులుగా కొనసాగుతున్నాయి.

Also Read:Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

అమెరికా ఇప్పటికే ఇరాన్‌లోని కొన్ని బ్రిడ్జెస్‌ను ధ్వంసం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. ట్రంప్ ఇంకా ఎక్కువ ధ్వంసం చేయలేదని, ఇప్పుడు మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ హెచ్చరికలు ప్రపంచ వ్యాపారం, ఆయిల్ మార్కెట్లు, మధ్యప్రాచ్య ప్రాంత స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి జరిగితే మిలియన్ల మంది విద్యుత్ సరఫరా నిలిచిపోయి, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.