ఏపీలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక గమనిక జారీ చేసింది. విశాఖపట్నం, తిరుపతి, నర్సాపురం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాలకు తిరిగే రైలు సర్వీసులను రెగ్యూలర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లను రెగ్యూలర్ సర్వీసులుగా చేస్తూ నిర్ణయించింది. వారంలో ఒకరోజు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
దేశవ్యా్ప్తంగా పలు రైళ్లను రెగ్యూలర్ సర్వీసుగా మారుస్తూ ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏపీ నుంచి నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటి వివరాలు ఒకసారి చూద్దాం.
నరసాపురం-తిరుపతి(17427/17428), సికింద్రాబాద్ – అనకాపల్లి(17043/17044), సికింద్రాబాద్ – అనకాపల్లి (17043/17044), నరసాపురం – తిరుపతి (17427/17428), చర్లపల్లి- అనకాపల్లి(17045/17046), కాకినాడ టౌన్-లింగపల్లి (12775/12776), తిరుపతి- అకోల (17429/17430), తిరుపతి- చర్లపల్లి (17441/17442) రైళ్లను రెగ్యూలర్ చేశారు.
తిరుపతి వెళ్లే పలు రైలు సర్వీసులను రెగ్యూలర్ చేయడం వల్ల తిరుమల వెళ్లే భక్తులకు ఊరట కలగనుంది. ప్రస్తుతం తిరుమల వెళ్లే రైళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయి. కనీసం కాలు పెట్టడానికి కూడా చోటు ఉండటం లేదు. ఇప్పుడు వీటిని రెగ్యూలర్ సర్వీసుగా మర్చడం వల్ల తిరుమల వెళ్లేవారికి బెనిఫిట్ జరగనుంది.
తిరుపతి-చర్లపల్లి(17441/17442) రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, మిర్యాలగూడ, నల్లగొండలో ఆగనుంది. ఇక తిరుపతి-అకోలకు రైలు(17429/17430) మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపురం, కన్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, మేడ్చల్, నిజామాబాద్ మీదుగా వెళుతుంది.




