కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు పెరుగు, పావుకిలో బంగాళా దుంపలు , 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ టీస్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి , అరటేబుల్ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు ఆకులు వేసుకోవాలి.
బంగాళా దుంప మజ్జిగ పులుసు తీసుకుని కడిగి క్లీన్ చేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పాత కాలంలో ఈ కూరను ఎంతో ఇష్టంగా తిన్నారు. మీరు దీనిని ఒకసారి వండితే మీ ఫేవరేట్ అవ్వడం పక్కా.
ఇప్పుడు రెండు కప్పులు పెరుగును తీసుకుని, దానిలో మూడు గ్లాస్ లు నీళ్ళు పోసి మజ్జిగలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మసాలా పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి
ఈ మజ్జిగను తీసుకుని దానిలో బంగాళా దుంపలు వేసి మీడియం మంటపై తక్కువగా పెట్టి 15 నిముషాల పాటు బాగా వేయించుకోవాలి.
బంగాళా దుంపలకు మజ్జిగ రసం పట్టే అలాగా ఉడికించుకోవాలి.
A చివర్లో మళ్ళీ పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు వేసి వాటిని బాగా వేయించుకోవాలి. ఈ బంగాళా మజ్జిగ పులుసును వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది.




