Reading Time: < 1 minute
Kanaka Durga Temple Maha Kumbhabhishekam 2026 Three Day Festival Begins At Indrakeeladri Vijayawada

Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలు మార్చి 6 నుంచి మార్చి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. మహోత్సవాల తొలి రోజు నేడు ఉదయం 7 గంటలకు కనకదుర్గా నగర్ నుంచి అర్చకులు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు ఘనంగా సాగుతూ ఇంద్రకీలాద్రి చేరుకోనుంది. అక్కడ మహా కుంభాభిషేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు బైబై..!

ఇక సాయంత్రం 4 గంటలకు అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు మంత్రపుష్పంతో తొలి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. మూడు రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ మహోత్సవాలను తిలకించేందుకు మూడు రోజులలో సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే భారీ ఏర్పాట్లు దేవస్థానం చేపట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

మరోవైపు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వి.ఐ.పి, వి.వి.ఐ.పి దర్శనాలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. అలాగే మార్చి 9 వరకు అర్జిత సేవలను రద్దు చేసినట్లు దేవస్థానం ప్రకటించింది. మూడు రోజుల పాటు అంతరాల దర్శనాలను కూడా నిలిపివేశారు. ఈ సమయంలో భక్తులకు బంగారు వాకిలి వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు.