Reading Time: < 1 minute

డిజిటల్ పేమెంట్స్‌పై ఆర్బీఐ కొత్త రూల్స్.. రూ .10 వేలు దాటితే గంట తర్వాతే నగదు బదిలీ!

Caption of Image.

న్యూఢిల్లీ:ఆన్​లైన్ మోసాలను అడ్డుకోవడానికి ఆర్​బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. డిజిటల్ లావాదేవీల రక్షణ కోసం గంట సమయం కూలింగ్ పీరియడ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. రూ.10 వేలు దాటిన యూపీఐ, ఐఎమ్​పీఎస్ వంటి తక్షణ నగదు బదిలీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. కేవలం వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) జరిగే బదిలీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వెరిఫైడ్​ మర్చంట్లకు చేసే చెల్లింపులపై దీని ప్రభావం ఉండదు. 

వినియోగదారులు ముందే ఆమోదించిన లబ్ధిదారులకు చేసే చెల్లింపులకు కూడా ఈ రూల్​వర్తించదు. 2021లో రూ.551 కోట్లుగా ఉన్న సైబర్ మోసాల విలువ 2025 నాటికి రూ.22, 931 కోట్లకు చేరింది. రూ.10 వేలకు పైబడిన లావాదేవీల్లోనే 98.5 శాతం మోసాలు జరుగుతున్నాయని ఆర్​బీఐ గుర్తించింది. ఇదిలా ఉంటే, కస్టమర్​ తనకు ఏదైనా డిజిటల్​ ఫ్రాడ్​ జరిగిందని భావిస్తే ఇక నుంచి కిల్​ స్విచ్​ను ఉపయోగించవచ్చు. దీనిని యాక్టివేట్​ చేస్తే డిజిటల్​ చెల్లింపులు అన్నీ ఆగిపోతాయి. 

©️ VIL Media Pvt Ltd.