Reading Time: 2 minutes
Modi Rahul Gandhi Conversation Parliament Video Viral

పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ-ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ చాలా సేపు సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Pm

శనివారం మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలోని ‘ప్రేరణ స్థల్’లో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి మోడీ, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్ నివాళులర్పించగా.. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తదితరులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి: US-Iran: ఇరాన్-అమెరికా మధ్య ప్రధాన డిమాండ్లు ఇవే! చర్చలు కొలిక్కి వచ్చేనా?

అంతకముందు ప్రధాని మోడీ పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాక అక్కడే వేచి ఉన్న రాహుల్ గాంధీకి నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కలిసి పలు విషయాలపై సంభాషించారు. మోడీ మాట్లాడుతుండగా.. రాహుల్ గాంధీ సమాధానం ఇస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది.

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్-బీజేపీ విమర్శలు.. ప్రతి విమర్శలతో వాగ్యుద్ధం జరుగుతోంది. అంతేకాకుండా పార్లమెంట్ సమావేశాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పెద్ద ఫైటింగే జరుగుతోంది. ఇలాంటి తరుణంలో మోడీ-రాహుల్ గాంధీ మాట్లాడుకోవడం ఆసక్తి రేపింది.