కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, ఒక కప్పు కందిపప్పు, నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు,
కారం, పసుపు, పావు కిలో బెల్లం ముక్క తీసుకోవాలి.
పోపు ఇలా పెట్టుకోవాలి: పోపు కోసం రెండు టేబుల్ స్పూన నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఇంగువను తీసుకోవాలి.
మామిడికాయలను ఉడికించుకోవాలి : ముందుగా మామిడికాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు కలిపి బాగా మెత్తగా ఉడికించాలి. ఉడికిన మామిడికాయ ముక్కలను తీసుకుని మెత్తగా చేసుకుని దానిలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి.
మరగబెట్టడం: ఒక కప్పు బెల్లం, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఆ రాసాన్ని 15 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి వాటిని బాగా మరగనివ్వాలి.
మళ్ళీ కొత్తగా పాన్ తీసుకుని దానిలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, మూడు వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా ఇంగువను వేసి మంచిగా పోపు పెట్టాలి. ఈ పోపును చారులో వేసుకోవాలి. చివర్లో కొత్తిమీరను తీసుకుని వేడి వేడి అన్నంతో కలుపుకుని తినాలి.




