
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: అంగన్ వాడీ వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొనయమాకుల రైతు వేదికలో శుక్రవారం గీసుగొండ, సంగెం మండలాల అంగన్ వాడీ టీచర్లకు మొబైల్స్ను కలెక్టర్సత్యశారదతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.