Reading Time: < 1 minute

మాస్ మీడియా ఆఫీసర్కు డాక్టరేట్

Caption of Image.

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మాస్ మీడియా ఆఫీసర్​గా పని చేస్తున్న మిఠాయి ప్రసాద్  రవికుమార్  డాక్టరేట్ సాధించారు. తాగునీటి వసతులు, పరిశుభ్రత, తాగే నీరు కలుషితమైనప్పుడు ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరంగా కలిగే నష్టాలపై ఆయన అధ్యయనం చేసి కుప్పం ధ్రువీడియన్  యూనివర్సిటీకి సమర్పించాడని డీఎంహెచ్​వో వసంత్ కుమార్  తెలిపారు. ఆయనను డీఎంహెచ్ వో, ఏవో శ్రీవాణి, ప్రోగ్రాం ఆఫీసర్లు శశాంక్, నాగ నిర్మాల, ప్రవీణ్ కుమార్, ఆఫీసు సిబ్బంది అభినందించారు.

©️ VIL Media Pvt Ltd.