
హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్ లపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎచ్ న్యూ సహాయంతో 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 190 మంది రౌడీ షీటర్లకు గంజాయి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన రౌడీషీటర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ అయ్యిందని వెల్లడించారు. నలుగురితోపాటు, వెస్ట్ జోన్ పరిధిలోని డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 13 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read:Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం మొత్తం 13మందికి డ్రగ్స్ పాజిటివ్.. బంజారాహిల్స్ పీఎస్ కు తరలించిన 13 మందిలో నలుగురు రౌడీ షీటర్లు ఉన్నారు. వీరందరిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాసేపట్లో వీరందరినీ నాంపల్లి కోర్టు లో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఎర్రగడ్డ లోని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.