Reading Time: < 1 minute
Whats Today On 11th April 2025

* భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్‌-2.. పసిఫిక్‌ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో ఆర్టెమిస్‌-2 ల్యాండింగ్.. ఇవాళ ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్‌ క్యాప్సూల్‌.. 10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్‌-2.. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్‌-2 విజయవంతం.. భూమిపైకి నలుగురు వ్యోమగాములు

* ఇస్లామాబాద్‌ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు.. ఇరాన్‌ హాజరుపై వీడిన ఉత్కంఠ.. అర్థరాత్రి ఇస్లామాబాద్‌ చేరుకున్న ఇరాన్‌ ప్రతినిధులు.. శాంతి చర్చలకు ముందు 2 కండీషన్లు పెట్టిన ఇరాన్‌.. లెబనాన్‌పై దాడులు ఆపాలి.. ఫ్రీజ్‌ చేసిన నిధులు విడుదల చేయాలని ఇరాన్‌ డిమాండ్‌..

* IPL: నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్ పంజాబ కింగ్స్‌.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌

* IPL: నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రాత్రి 7.30కి మ్యాచ్‌

* ఢిల్లీ: ఇవాళ జరిగే “ఇండియా” కూటమి భాగస్వామ్యపక్షాల సమావేశం లో “మహిళ రిజర్వేషన్లు” పై చర్చించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం

* నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్… డీసీసీ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన ములుగు జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం

* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం.. హాజరుకానున్న పార్టీ ముఖ్యనేతలు..

* కర్నూలు: నేడు గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలలో ప్రభోత్సవం

* నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న కాకినాడ జిల్లా కి చెందిన ప్రజా ప్రతినిధులు

* విశాఖ: నేడు సింహాచలం చంద‌నోత్సవంపై రాష్ట్ర మంత్రుల స‌మీక్ష.. పాల్గొనున్న ఇంచార్జ్ మంత్రి డీబీవీ స్వామి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, స‌త్యప్రసాద్, అనిత

* కర్నూలు: నేటి నుండి రెండు రోజులు పత్తికొండలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి 11వ మహాసభలు ప్రారంభం

* తిరుమల: 8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు