Reading Time: < 1 minute
Amit Shah Humayun Kabir Sting Babri Masjid Bjp Stand

Amit Shah: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కీలక మైనారిటీ నేత హుమాయున్ కబీర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయనపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు రాజకీయాలకు కేంద్రంగా మారింది. బీజేపీ-హుమాయున్ కబీర్ మధ్య రూ. 1000 కోట్ల డీల్ జరిగిందని ఓ వీడియోలో హుమాయున్ కబీర్ చెబుతున్నట్లు కనిపించడంతో వివాదం ముదిరింది. బెంగాల్ మాల్దాలో బాబ్రీ మసీదు నిర్మిస్తూ వార్తల్లో నిలిచిన కబీర్ ఇప్పుడు ఈ వీడియోతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

Read Also: Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

అయితే, ఈ వ్యవహారంతో స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ‘‘బాబ్రీ మసీదు నిర్మించే వారితో కలిసి పనిచేయడం కన్నా, మరో 20 ఏళ్లు మేము ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధం’’ అని ప్రకటించారు. ఇప్పుడు హుమాయున్ కబీర్ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విచారణ జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వీడియోలో తాను బీజేపీ నాయకులతో ఒప్పందం చేసుకున్నట్లు కబీర్ చెబుతున్నట్లు ఉంది. అయితే, ఇది ఏఐతో చేసిన వీడియో అని కబీర్ ఆరోపించారు. తనను అప్రతిష్టపాలు చేయడానికి టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపించారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో టీఎంసీ తనపై ఇలాంటి ప్రచారాన్ని చేస్తుందని కబీర్ అన్నారు. దీనిపై పరువు నష్టం కేసు పెడతానని బెదిరించారు.

ఈ వీడియోను బీజేపీ ఖండించింది. హుమాయున్ కబీర్, బీజేపీలు ఉత్తర-దక్షిణ ధ్రువాల లాంటివని ఇవి ఎప్పటికీ కలవవని అమిత్ షా అన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి 2000 వీడియోలను క్రియేట్ చేయగలదని ఆయన ఆరోపించారు. దీనికి ముందు మాజీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. కబీర్ రూ. 1000 కోట్లు కాదు కదా, రూ. 100 కోట్లకు కూడా అర్హత లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు.