Reading Time: < 1 minute
India 1000km Quantum Communication Network Nqm Breakthrough

Quantum Technology: భారతదేశం చరిత్ర సృష్టించింది. టెక్నాలజీలో భారీ ముందడుగు పడింది. భారత్ స్వదేశీ టెక్నాలజీతో 1000 కి.మీ క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశ భద్రత, డేటా సెక్యూరిటీకి అతిపెద్ద బలంగా మారనుంది. జాతీయ క్వాంటం మిషన్ (NQM) కింద భారతదేశం రెండు సంవత్సరాల కన్నా తక్కువ కాలంలోనే 1,000 కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ప్రదర్శించింది. నిజానికి 8 ఏళ్లలో 2000 కిలోమీటర్లు లక్ష్యాన్ని పెట్టుకుంటే, రెండేళ్లలోనే 1000 కి.మీలు పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డ్. ఈ టెక్నాలజీ ద్వారా డేటాను హ్యాక్ చేయని విధంగా పంపించొచ్చు. ఎవరైనా డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తే గుర్తించవచ్చు. దీనిని అన్ బ్రేకబుల్ ఎన్‌క్రిప్షన్ అని కూడా అంటారు.

Read Also: Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

ఈ టెక్నాలజీలో క్యూన్యూ లాబ్స్ కీలక పాత్ర పోషించింది. ఈ విజయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) వ్యవస్థలలో ఒకటిగా నిలిచి, భారతదేశ క్వాంటం-సురక్షిత భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ఈ విజయం ద్వారా భారత రక్షణ, ఆర్థిక వ్యవస్థలు, కీలక మౌలిక సదుపాయాల సురక్షిత కమ్యూనికేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ సాంకేతికత ద్వారా నీటి అడుగున, భూగర్భ నెట్వర్క్‌లతో సహా సవాలులో కూడిన భూభాగాల్లో కూడా మెరుగైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఫైబర్ అవసరం లేకుండా సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్, సెన్సింగ్ వంటి రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది.

గతంలో డీఆర్డీఓ కూడా క్వాంటం కమ్యూనికేషన్‌పై ప్రయోగం చేసింది. 1 కి.మీ దూరంలో సెక్యూర్ డేటా ట్రాన్స్‌మిషన్ సాధించింది. రియల్ టైమ్‌లో కూడా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని నిరూపించింది. నిజానికి భారత ప్రభుత్వం 2023లో ఈ మిషన్ కోసం బడ్జెట్‌లో రూ. 6000 కోట్లకు పైగా కేటాయింపులతో జాతీయ క్వాంటం మిషన్ (NQM)ను ఆమోదించింది. క్వాంటం కమ్యూనికేషన్లో చైనా నెంబర్ వన్‌గా ఉంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, యూకేలు కూడా ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి.