
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.38 కోట్లు విలువచేసే 30 కేజీల బంగారం సీజ్ చేశారు. కెన్యా నుండి ముంబై వచ్చిన లేడీ స్మగ్లర్స్ వద్ద బంగారం గుర్తించిన డీఆర్ఐ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి యత్నించారు విదేశీ మహిళలు. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబై ఎయిర్పోర్ట్లో డి ఆర్ ఐ బృందం మాటు వేసింది. కెన్యా నుండి తీసుకొచ్చిన బంగారంతో ముంబై ఎయిర్పోర్ట్లో దిగారు 24 మంది మహిళ స్మగ్లర్స్ బృందం.
Also Read:OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!
లేడీ కిలాడీలు అక్రమ బంగారంతో బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. అధికారులను బురిడీ కొట్టించడానికి బుర్కా ధరించి బంగారాన్ని బయటకి తరలించే సకల ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్లో అధికారుల తనిఖీలను పసిగట్టి వారి వద్ద ఉన్న బంగారం బ్యాగ్ లను కిలాడీలు పడేశారు. ముంబై ఎయిర్పోర్ట్ లో రెండు గంటలపాటు హంగామా చేశారు 24 మంది మహిళ స్మగ్లర్స్ ముఠా. అధికారులని ముప్పతిప్పలు పెట్టిన లేడీ కిలాడీలు. లేడీ కిలాడి స్మగ్లర్స్ ముఠా ప్రయత్నాలను తిప్పి కొట్టారు డి ఆర్ ఐ అధికారులు. 24 మంది మహిళా స్మగ్లర్స్ ముఠా అరెస్ట్ చేసి వారి వద్ద 30 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై డిఆర్ఐ అధికారులు తెలిపారు.