హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయ అంటే చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు శుభప్రదమైన పనులు చేయాలి అంటారు. అంతే కాకుండా అక్షయ తృతీయ కొత్త పనులు ప్రారంభించడానికి, వ్యాపార ప్రారంభానికి అద్భుతమైన రోజు. అందుకే ఈరోజున చాలా మంది కొత్త పనులు ప్రారంభిస్తారు.
వైశాఖ మాసం మూడో రోజు, వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 2026 ఏప్రిల్ 19న ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయను జరుపుకుంటారు. అయితే అక్షయ తృతీయ అంటే ఆరోజు తప్పకుండా బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనే ఒక సెంటిమెంట్ ఉంది. మరి ఈ రోజు తప్పకుండా బంగారం కొనుగోలు చేయాలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయం అంటే తరగనిది అని అర్థం. అందుకే ఈరోజున దానధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుందని అని చెబుతున్నారు పండితులు. చాలా మంది బంగారం కొనుగోలు చేయాలి అంటారు. కానీ అక్షయ తృతీయ రోజున చెప్పులు, నీటి కుండ దానం చేయడం చాలా మంచిదంట. దీని వలన అదృష్టం కలిసి రావడమే కాకుండా సంపద కూడా పెరుగుతుందంట.
చాలా మంది ధరను కూడా లెక్క చేయకుండా పోటీ పడి మరి బంగారం కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. దీంతో చాలా మంది ఈరోజు తప్పకుండా బంగారం కొనుగోలు చేయాలేమో అనుకుంటారు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలని ఎక్కడా లేదు.
కానీ ఈ రోజు దానధర్మాలు చేయడం వలన కలిసి వస్తుందంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




