Reading Time: < 1 minute
Kadapa Student Murder Girl Killed In Alleged Love Attack Accused Detained

Love Attack: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైదుకూరు సమీపంలోని ఖాజీపేట అగ్రహారంలో కీర్తన అనే విద్యార్థిని హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమోన్మాది దాడిగా భావిస్తున్న ఈ ఘటన ప్రజలను షాక్‌కు గురిచేసింది. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం, కీర్తనపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కడపకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.

Read Also: HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

ఈ ఘటనకు సంబంధించి ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. అయితే, అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. శిక్షలు పడుతున్నా.. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి..