Reading Time: < 1 minute

సింగరేణి పరిరక్షణకు ఐక్య పోరాటాలు

Caption of Image.

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయడానికి కార్మిక సంఘాలు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ స్టేట్​ప్రెసిడెంట్ తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట1 బొగ్గు గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. మెడికల్ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వైఖరి సరిగాలేదన్నారు. కార్మిక సంఘాలను బద్నానం చేస్తున్న సర్కార్..​సంస్థకు ఇవ్వాల్సిన రూ.వేల కోట్ల బకాయిలపై నోరు మోదపడంలేదని విమర్శించారు.

మెడికల్​బోర్డును వెంటనే నిర్వహించాలని డిమాండ్​చేశారు. గెలిచిన సంఘాల లీడర్ల అలసత్వంతో సింగరేణి యాజమాన్యం రెండేళ్లుగా కార్మికులకు నాణ్యమైన రక్షణ పనిముట్లు  ఇవ్వడంలేదన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గని మేనుజర్​సతీశ్​కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ డిప్యూటీ జనరల్​సెక్రటరీ అల్లి రాజేందర్, మందమర్రి బ్రాంచి ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి, పిట్​సెక్రటరీ శ్రీధర్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.