Reading Time: 2 minutes

సాధారణంగా ఆదివారం అంటే ఆఫీసులకు సెలవు ఇంటిల్లిపాది విశ్రాంతి తీసుకునే రోజు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో దేశ ఆర్థిక చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ పార్లమెంటు ముందుకు వస్తోంది. సెలవు రోజైనప్పటికీ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఆర్థిక లెక్కల కోసం యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విశేషాల వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను మనము తెలుసుకుందాం..

చరిత్ర పునరావృతం – 1999 నుండి 2026 వరకు: భారత బడ్జెట్ చరిత్రలో ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. చివరిసారిగా 1999లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 28 ఆదివారం రోజున బడ్జెట్‌ను సమర్పించారు.

మళ్లీ ఇన్నాళ్లకు అంటే 2026లో అదే అరుదైన సందర్భం పునరావృతమవుతోంది. సాధారణంగా పని దినాల్లోనే బడ్జెట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది కానీ ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టాలనే నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏ వారం వచ్చినా బడ్జెట్‌ను ప్రవేశపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Rare After 27 Years: Union Budget Presented on a Sunday for the First Time
Rare After 27 Years: Union Budget Presented on a Sunday for the First Time

సెలవు రోజున ఆర్థిక సందడి – దీని వెనుక వ్యూహం: ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల స్టాక్ మార్కెట్లు మరియు ఆర్థిక సంస్థలపై తక్షణ ప్రభావం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సాధారణంగా బడ్జెట్ రోజున మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి.

అయితే ఆదివారం సెలవు కావడంతో మార్కెట్ విశ్లేషకులకు మరియు పెట్టుబడిదారులకు బడ్జెట్ అంశాలను క్షుణ్ణంగా విశ్లేషించుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. సోమవారం మార్కెట్లు తెరిచే సమయానికి అందరికీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సెలవును కూడా లెక్కచేయకుండా బడ్జెట్ తేదీకి కట్టుబడి ఉండటం దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనం.

వారం ఏదైనా రోజు ఏదైనా సగటు భారతీయుడు కోరుకునేది ఒక్కటే.. తమ జీవితాల్లో సానుకూల మార్పు. ఈ ఆదివారం బడ్జెట్ పై సామాన్యుడికి ఎన్నో ఆశలు ఉన్నాయి. ధరల నియంత్రణ, పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో అనే ఉత్కంఠ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది.

సెలవు రోజు కావడంతో ప్రజలందరూ తమ కుటుంబాలతో కలిసి టీవీల ముందు కూర్చుని ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని వినే అవకాశం ఈసారి లభించింది. ఈ అరుదైన ఆదివారం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిస్తుందని ఆశిద్దాం.

The post 27 ఏళ్ల తర్వాత అరుదైన సందర్భం: తొలిసారి ఆదివారం కేంద్ర బడ్జెట్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.