
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సామూహిక గృహ ప్రవేశాల పండుగ ఘనంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో విడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రెండున్నర లక్షల ఇళ్లలో లక్ష టిడ్కో గృహాలు కాగా, మరో లక్షన్నర ఇతర కేటగిరీల ఇళ్లు ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం, పుదూరు గ్రామం వేదికగా లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు