పిల్లల జీవితంలో ఓనమాలు దిద్దించే ‘అక్షరాభ్యాసం’ ఒక మధురమైన ఘట్టం. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ దేవి జన్మించిన వసంత పంచమి రోజూ అక్షర శ్రీకారం చుట్టడం అత్యంత శుభప్రదమని మన నమ్మకం. 2026లో జనవరి 23వ తేదీన వచ్చే ఈ పవిత్ర పర్వదినం కోసం తల్లిదండ్రులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. తమ బిడ్డలు విద్యాబుద్ధుల్లో రాణించాలని కోరుకుంటూ ఈ మంగళకరమైన రోజున సరస్వతీ అమ్మవారి సాక్షిగా అక్షర లోకంలోకి వారిని ఆహ్వానించడం ఒక గొప్ప సంప్రదాయం.
2026 వసంత పంచమి ముహూర్తం: హిందూ పంచాంగం ప్రకారం 2026లో మాఘ శుద్ధ పంచమి అంటే జనవరి 23 శుక్రవారం నాడు వసంత పంచమి జరుపుకుంటున్నాము. ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉంటుంది, అంటే రోజంతా శుభ సమయమే. అయినప్పటికీ ఉదయం 7:10 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అక్షరాభ్యాసానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ రోజున బాసర వంటి క్షేత్రాలలో లేదా ఇంట్లోనే అమ్మవారి పూజ చేసి బిడ్డ చేత బియ్యంపై ‘ఓం’ అని రాయించి అక్షరాబ్యాసం చేయిస్తారు. వల్ల వారికి బుద్ధి బలం, వాక్చాతుర్యం సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

విద్యారంభం – తల్లిదండ్రుల బాధ్యత: అక్షరాభ్యాసం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది బిడ్డ ఉజ్వల భవిష్యత్తుకు పునాది. ఈ రోజున చిన్నారులకు కొత్త బట్టలు వేసి, పసుపు, కుంకుమ, పూలతో సరస్వతీ దేవిని ఆరాధించి, గురువుల ఆశీస్సులు తీసుకోవాలి. కేవలం అక్షరాలు నేర్పించడమే కాకుండా, వారిలో పఠనాసక్తిని పెంపొందించేలా ఈ వేడుకను నిర్వహించాలి. జ్ఞానమే అన్నిటికంటే గొప్ప సంపద అని చాటిచెప్పే ఈ వసంత పంచమి, ప్రతి ఇంట్లో విద్యా కాంతులు నింపాలని ఆకాంక్షిద్దాం.
గమనిక: పైన పేర్కొన్న ముహూర్త వివరాలు పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి. మీ ప్రాంతీయ సమయాలు మరియు మీ నక్షత్ర రీత్యా ఖచ్చితమైన సమయం కోసం స్థానిక పురోహితులను సంప్రదించవలసిందిగా మనవి.
The post అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తం ఇదే! 2026 వసంత పంచమి పూర్తి వివరాలు appeared first on Manalokam – Latest Telugu News & Updates.