
అంతరక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ని నటుడు ప్రకాశ్ రాజ్ కలిశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ వీరిద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ సునీతాతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం రావడం మరచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సునీత మాట్లాడుతూ.. అంతరిక్ష అనుభవాలు గురించి తెలిపారు. అంతేకాక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. అంతరిక్ష కేంద్రంలో నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. అక్కడ ప్రతి రోజూ కొత్తగా ఉంటుందని తెలిపారు. కల్పనా చావ్లాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
What a moment to cherish …. to meet .. to have conversed with such a courageous woman of our times .. #SunithaWilliams at #KLF … sharing with you all my over the moon memories ❤️❤️❤️ pic.twitter.com/YN5JfyP9Tt
— Prakash Raj (@prakashraaj) January 22, 2026