
చేసేది క్యాటరింగ్ పనే ఐనా… ఫుల్ టైంలో మాత్రం కంత్రీ పనులు చేస్తున్నాడో కేటుగాడు. ఫంక్షన్లకు క్యాటరింగ్ ఫుడ్ సప్లై చేస్తూ.. ముందుగా మాట్లాడుకున్న దాని కంటే అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకుని ప్రశ్నిస్తే… ఫంక్షన్లో దొంగచాటుగా మహిళల ఫొటోలు తీసి.. మార్ఫింగ్ చేసి వేధిస్తున్నాడు. సికింద్రాబాద్ అడ్డాగా క్యాటరింగ్ చాటున కంత్రీ పనులకు పాల్పడుతున్న కేటుగాడిని పట్టుకున్నారు పోలీసులు.
సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్కి చెందిన వన్నూరు స్వామి అలియాస్ అంజి కిరణ్… స్థానికంగా క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మీటింగ్లు, ఫంక్షన్లకు ఫుడ్ సప్లై చేయడమే కాకుండా, వడ్డించేందుకు క్యాటరింగ్ బాయ్స్ను కూడా సప్లై చేస్తుంటాడు. మోండా మార్కెట్లో నివసిస్తున్న ఓ వ్యక్తి… తన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కోసం అంజి కిరణ్ వద్ద క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ బుకింగ్ సమయంలోనే ప్లేట్ భోజనానికి ఎంత ఛార్జ్ అవుతుంది? ఎన్ని ప్లేట్లు తెస్తారు? ఎంతమంది క్యాటరింగ్ బాయ్స్ వస్తారు? వాళ్లకు ఎంత ఇవ్వాలి? అనేది మాట్లాడుకున్నారు.
Also Read:IAS Officer: గుంజీలు తీసిన ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా.. కారణం ఇదే..
తీరా ఫంక్షన్ ముగిసిన తర్వాత అంజి కిరణ్ అదనంగా బిల్లు వేశాడు. ఏవేవో ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు డిమాండ్ చేశాడు. ఎందుకు ఇవ్వాలి అని అడిగితే గొడవ పెట్టుకున్నాడు. అసభ్యంగా దూషించాడు. ఫంక్షన్ జరుగుతున్న సమయంలో ఫంక్షన్కి అటెండ్ అయిన మహిళల ఫొటోలు తీశానని… వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిలింగ్కి దిగాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అంజి కిరణ్పై ఫిర్యాదు చేశారు.
వన్నూరు స్వామి అలియాస్ అంజి కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఇదే తరహాలో పలుచోట్ల బెదిరింపులకు, వేధింపులకు, బ్లాక్మెయిలింగ్కు దిగినట్లు గుర్తించారు పోలీసులు. గతంలో ఇలాంటివే రెండు కేసులు కూడా తనపై నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అంజి కిరణ్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చూశారా..!! క్యాటరింగే కదా అని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ.. క్యాటరింగ్ బిజినెస్ మాటున ఇలాంటి.. కంత్రీగాళ్లు కూడా పోలీసులు చెబుతున్నారు.