
షియోమి అధికారికంగా రెడ్మి A7 ప్రోను విడుదల చేసింది. ఈ ఫోన్లో కంపెనీ హార్డ్వేర్ అప్గ్రేడ్లపై దృష్టి సారించింది. వీటిలో పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, షియోమి హైపర్ఓఎస్ 3 ఇంటిగ్రేషన్ వంటివి ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, రెడ్మి A7 ప్రో 6.9-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 800 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్నెస్ను చేరుకోగలదు. ఈ ఫోన్లో వెట్ టచ్ టెక్నాలజీ 2.0 కూడా ఉంది, ఇది వినియోగదారుడి వేళ్లు తడిగా లేదా సబ్బుతో ఉన్నప్పుడు కూడా టచ్ రెస్పాన్సివ్నెస్ను నిర్ధారించడానికి రూపొందించారు.
Also Read:Allahabad High Court: భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే.. ‘‘భరణం’’పై కీలక తీర్పు..
ఈ స్మార్ట్ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఈ పరికరం 8GB వరకు వర్చువల్ RAMకు కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, ఈ పరికరంలో 6,000mAh బ్యాటరీ ఉంది, ఇది 49 గంటల వరకు కాల్ సమయాన్ని, 35 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ను లేదా 77 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ను అందించగలదు.
రెడ్మి A7 ప్రో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్. ముందు భాగంలో సింగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్లో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది HDR+ నైట్ మోడ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్లో అంతర్నిర్మిత బ్యూటీ ఫిల్టర్లు, నైట్ మోడ్తో కూడిన 8MP ఫ్రంట్ సెన్సార్ కూడా ఉంది. ఈ రెడ్మి డివైస్ 4GB+64GB, 4GB+128GB అనే రెండు మెమరీ, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. బేస్ మోడల్ ధర 119 డాలర్లు (సుమారుగా రూ. 11,100), 128GB మోడల్ ధర 129.99 యూరోల నుండి ప్రారంభమవుతుంది. అయితే, తుది ధర, లభ్యత ప్రాంతాన్ని బట్టి మారుతుందని షియోమి పేర్కొంది.