
* ఐపీఎల్: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటకు మ్యాచ్
* ఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్న జనగణన.. సహజీవన జంటలకు సైతం కుటుంబ హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన.. రెండు విడతల్లో జనగణన.. మొదటి విడతలో ఇళ్ల సర్వే.. రెండవ విడతలో జనాభా లెక్కింపు
* ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధమైన స్పష్టత.. నేడు పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026.. చట్ట సవరణ బిల్లు లక్ష్యాలు, కారణాలను తెలియజేస్తూ స్పష్టమైన ప్రకటన చేసిన హోం మంత్రి అమిత్షా..
* తిరుమల: నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగింపు.. శ్రీమలయప్పస్వామికి వసంత మండపంలో అభిషేకాలు..
* నేడు నెల్లూరు, కడప జిల్లా్ల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా వింజమూరులో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం.. లబ్ధిదారులతో మాట్లాడి అనంతరం బహిరంగసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. ఉదయగిరి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టకు చంద్రబాబు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోదండరామస్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం .. రాత్రికి సీఎం ఒంటిమిట్టలోని టీటీడీ కల్యాణమండపంలోనే బస…
* నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్.. రెండు రోజులపాటు కేరళలోనే సీఎం రేవంత్ రెడ్డి
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్మీట్.. తాజా రాజకీయాలు, సమకాలీన అంశాలపై మాట్లాడనున్న జగన్
* నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్.. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించారని చికెన్ షాపుల ఓనర్ల నిరసన.. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్
* ఏపీ: నేడు పోలవరం జిల్లా చింతూరు కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు.. మరో 8 మండలాల్లో వడగాలుల ప్రభావం.. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
* విజయనగరం: ఉదయం 08.30 గంటలకు ఎం ఎస్ ఎం ఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరం మండలం రామన్నపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తారు. అనంతరం 09:30 గంటలకు అదే గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి స్థానిక తోట పాలెం గాయత్రి కళాశాల దగ్గర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తారు.
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని శారదనగర్,దుర్గా నగర్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్ యాదవ్..
* అనంతపురం : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* కర్నూలు: నేటి నుండి కె.నాగులాపురం శ్రీ సుంకులాపరమేశ్వరి దేవి తిరునాళ్ల మహోత్సవాలు .. నేడు గణపతిపూజ పుణ్యహవాచనం , కంకధారణ ,అంకురార్పణ
* శ్రీ సత్యసాయి : ఇవాళ సత్యసాయి జిల్లా డిఆర్సి (జిల్లా అభివృద్ధి కమిటీ) సమావేశం.. హాజరుకానున్న ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు.
* నంద్యాల: నేడు శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్న కేంద్ర డ్యామ్ భద్రత కమిటీ బృందం.. డ్యామ్ ఎక్స్ఫర్ట్ డీకే శర్మ ఆధ్వర్యంలో 4 సభ్యుల బృందం పర్యటన.. జలాశయం పరిస్థితులపై పరిశీలించనున్న బృందం సభ్యులు .. పరిశీలన అనంతరం డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద సమావేశం కానున్న కేంద్ర డ్యామ్ భద్రత కమిటీ సభ్యుల బృందం
* నేడు కాకినాడ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్న హరేంధిర ప్రసాద్
* కాకినాడ: నేడు వేట్లపాలెం రానున్న విచారణ కమిటీ.. ఫిబ్రవరి 28న జరిగిన బాణాసంచా పేలుడు ఘటనపై విచారణకు గతంలో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాద తీవ్రతపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న కమిటీ.. వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో 28 మంది మృతి
* ఖమ్మం: నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఖమ్మం కు చేరిన 1,65,000 చేనేత చీరలు
* జగిత్యాల జిల్లా: నేటి నుండి కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు.. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలు నిలిపివేత తిరిగి 4వ తేదీన నల్ ప్రారంభం.. నేటి నుంచి 3 వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు .. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు