
YS Jagan: అమరావతి రాజధాని విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ – బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి సీఎం చంద్రబాబు ఆలోచించలేదన్నారు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ, developed highway ఇప్పటికే ఉందని అన్నారు. ఈ 110 కి.మీ Highwayకు అటు, ఇటు capital corridor కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు.
READ ALSO: LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ తెలుగు టీజర్ రిలీజ్ .. ఫ్యూచర్ లో ప్రేమకథ ఇలా ఉంటుందా?
మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోని, MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయాలని సూచించినట్లు వివరించారు. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చామన్నారు. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా అని ప్రశ్నించారు. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించినట్లు పేర్కొన్నారు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుందని, ఈ సలహా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదన్నారు.
విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది. మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. ఈ ప్లాన్ బి ని అమలు చేస్తే అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదన్నారు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడని విమర్శించారు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కాములు కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడని ఎద్దేవా చేశారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేస్తున్నాడన్నారు.